గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ తరలింపుపై హైకోర్టు స్టే

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ తరలింపుపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను బాటసింగారానికి తరలించడం  ఆపాలని హైకోర్టు శుక్రవారం స్టే విధించింది.  ఈ నెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని చెప్పింది. బాటసింగారంలో వసతులపై కౌంటర్​ ఫైల్​ చేయాలని రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. మార్కెట్​ తరలింపు పై  ఫ్రూట్‌ మార్కెట్‌ హోల్‌సేల్‌ కమీషన్‌ ఏజెంట్లు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను జడ్జిలు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల బెంచ్‌ శుక్రవారం విచారించింది. బాటసింగారంలో  సౌలత్​లు కల్పించకుండానే ప్రభుత్వం మార్కెట్​ తరలింపు  చేపట్టిందని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు.  ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు విన్న హైకోర్టు  తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.