ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద కేరళ ఎంపీల హైడ్రామా

ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద కేరళ ఎంపీల హైడ్రామా

ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు కేరళ యూడీఎఫ్ ఎంపీలు. కేరళలోని కె సిల్వర్ లైన్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన యూడీఎఫ్ ఎంపీలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. కేరళ ప్రభుత్వం ఆమెదించిన కె-సిల్వర్ లైన్ ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకమైందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. కేరళ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రం అని కె-సిల్వర్ ప్రాజెక్టు ఆర్థికంగా లాభసాటి కాదన్నారు. మరోవైపు కె-సిల్వర్ ప్రాజెక్టు అనుమతి గురించి చర్చించేందుకు ప్రధానిని కలిశారు కేరళ సీఎం పినరయి విజయ్. కేరళ ప్రజల ఆందోళన చూడాలని.. సీఎం విజయన్ ను ఆపాలని ప్రధానిని కోరారు కేసీ వేణుగోపాల్. సీపీఐ ఎం బీజేపీ కలిసే ఉన్నాయని... ప్రాజెక్టుకు ప్రధాని ఆమోదం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

నువ్వా–నేనా!: అంబానీ–అదానీల మధ్య ముదురుతున్న పోటీ