ఔరంగాబాద్​ బీఆర్ఎస్ సభపై హైడ్రామా

ఔరంగాబాద్​ బీఆర్ఎస్ సభపై హైడ్రామా

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈనెల 24న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్​బహిరంగ సభ అనుమతిపై బుధవారం హైడ్రామా నడిచింది. ఔరంగాబాద్‌‌‌‌‌‌‌‌లోని అంఖాస్ మైదానంలో 24న నిర్వహించే బీఆర్ఎస్​బహిరంగ సభకు పర్మిషన్​ ఇవ్వాలని స్థానిక నాయకులు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని పోలీసులు చెప్పారు.  దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ​చీఫ్, సీఎం కేసీఆర్ ​అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ​ప్రకారం 24న సభ నిర్వహించి తీరాల్సిందేనని, ఇంకో గ్రౌండ్​ చూసి పర్మిషన్​ కోసం ప్రయత్నించాలని నాయకులను ఆదేశించారు.

ఔరంగాబాద్‌‌‌‌‌‌‌‌లోని జంబిదా మైదానంలో సభ నిర్వహించుకుంటామని, అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు తిరిగి అప్లయ్​ చేసుకున్నారు. అక్కడ సభ నిర్వహణకు పోలీసులు ఓకే చెప్పడంతో  .. సభా వేదిక, ఇతర ఏర్పాట్లకు ఎమ్మెల్యే జీవన్​రెడ్డి భూమి పూజ చేశారు.