బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన మరో వార్త నగర వాసులను భయపెట్టిస్తోంది.
జులై 27 రాత్రి 5 – 6 సెం.మీ.ల వర్షపాతం నగరంలో నమోదు కానుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న చెప్పారు. ఈ వార్త పబ్లిక్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్పా బయటకి రావొద్దని సూచిస్తున్నారు.
వరదలు.. ట్రాఫిక్ జామ్లు..
నగరంలో కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ఎల్బీనగర్, పటాన్చెరు, మేడ్చల్ లాంటి సిటీ బయటి ప్రాంతాలే కాక.. సిటీలోని ప్రాంతాలు సైతం తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలతో పాటు పబ్లిక్ సమస్యలు కూడా తగ్గట్లేదు. ఆఫీస్లకు వెళ్లేవారు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.