ఏపీ భవన్ లో ఉద్రిక్తత...

 ఏపీ భవన్ లో ఉద్రిక్తత...

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీ భవన్ లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నాకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని భద్రతా సిబ్బంది ఏర్పాట్లను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదిని తెలిపారు. అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరకి అంబెద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకి దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేశారు.