లింగయ్య vs  వీరేశం :  రసవత్తరంగా నకిరేకల్​ బీఆర్​ఎస్​ పాలిటిక్స్

లింగయ్య vs  వీరేశం :  రసవత్తరంగా నకిరేకల్​ బీఆర్​ఎస్​ పాలిటిక్స్

నల్గొండ, వెలుగు :  నకిరేకల్​ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం మధ్య పొలిటికల్​ వార్​ తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే చిరుమర్తి కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​లో చేరినప్పటి నుంచే ఈవేడి మొదలైంది. చిరుమర్తికి వ్యతిరేకంగా పార్టీలోనే ఉంటూ వీరేశం తన బలాన్ని వివిధ రూపాల్లో చూపుతున్నారు.  స్థానిక, సహకార ఎన్నికలు, నకిరేకల్, చిట్యాల మున్సిపల్​ ఎన్నికల్లో వీరేశం తన వర్గీయులను ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ మీద నిలబెట్టి సత్తా చాటుకున్నారు. అయితే చిరుమర్తి, వీరేశం మధ్య రాజీ కుదిర్చించేందుకు జిల్లా ముఖ్యనేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పైగా చిరుమర్తికి వ్యతిరేకంగా పార్టీలో కొనసాగుతూనే వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. 

వీరేశాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు చిరుమర్తి కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లో కేడర్​ను తన వైపు తిప్పుకున్నారు. వివిధ అభివృద్ధి పనులను సాంక్షన్​ చేయించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇద్దరి మధ్య పొలిటికల్​ వార్​ రచ్చకెక్కింది. వీరేశం ఇప్పటి నుంచే బలప్రదర్శనకు దిగారు. దీనిలో భాగంగా వీరేశం బర్త్​డే వేడుకులకు పొలిటికల్​ కలర్​ ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బర్త్​డే వేడుకలకు భారీ జనసమీకరణ చేశారు. దీంతోపాటు బీఆర్​ఎస్​ టికెట్​ తన దేనని ప్రకటించారు. కేసీఆర్​, కేటీఆర్​ల పైన తనకు అపారమైన నమ్మకం ఉందని పబ్లిక్​లో ప్రకటించారు. కోమటిరెడ్డి బ్రదర్స్​ అండతోనే నకిరేకల్​లో మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిరుమర్తి రెం డు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

బ్రదర్స్​ను కాదని పార్టీ మారి, బీఆర్​ఎస్​లో ఎదురీత తప్పలేదు. వీరేశం ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఆయన నుంచి ఎదురైన అవమానాలు తట్టుకోలేకనే పార్టీ మారాల్సి వచ్చిందనే విషయాన్ని చిరుమర్తి పార్టీ కేడర్​కు వివరించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మంత్రి జగదీశ్​​రెడ్డి, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి,  జడ్పీ చైర్మన్​ బండా న రేందర్​ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ చిరుమర్తికి అండగా నిల బడ్డారు.చిరుమర్తి బీఆర్ఎస్​లో చేరినప్పటి నుంచి వీరేశం పొలిటికల్​ స్టాండ్​ పూర్తి గా మార్చేశారు. తన కేడర్​ను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే పైన ఎదురుదాడికి దిగారు. మంత్రి హారీశ్​రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరె డ్డితో టచ్​లో ఉంటూ.. గ్రౌండ్​ వర్క్​ పైనే ఫోకస్​ పెట్టారు. 

ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్​, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి అన్న కృష్ణారెడ్డి, బీసీ కార్పోరేషన్​ మాజీ చైర్మన్​ పూజర్ల శం బయ్య వీరేశానికి అండగా నిలబడ్డారు. అయితే ఇటీవల బీఆర్​ఎస్​ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీని వీడటంతో అందరి దృష్టి వీరేశం పై పడింది. పొంగులేటితో వీరేశానికి ఉన్న సన్నిహిత సంబంధాలు రాజకీయంగా పలు అనుమానాలకు దారితీశాయి. కానీ ఊహించని  రీతిలో వీరేశం తనకే టికెట్​ వస్తదని, కేసీఆర్​ పైన నమ్మకం ఉందని ప్రకటించడం ఆసక్తిగా 
మారింది. 

టికెట్​ ఎవరికో...

బీఆర్​ఎస్​ టికెట్​ తనకే ఖాయమంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి అదే విషయాన్ని నేరుగా కేసీఆరే​ చెప్తాడని ఆశిస్తున్నారు. ఇందుకోసం బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్​ ప్రారంభోత్సవానికి కేసీఆర్​ను ఆహ్వానించారు. దీంతోపాటే మరిన్ని అభివృద్ధి పనులకు సీఎంతో శంకుస్థాపన చేయించాలనే ప్లాన్​లో ఉన్నారు. అయితే చిరుమర్తి అనుకున్నది నెరవేరుతుందా? లేకా ఎలక్షన్​ వరకల్లా పరిస్థితులు మారుతాయా అన్నది ఆసక్తికరమే. మరోవైపు వీరేశం కూడా సొంత ప్లాన్​లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ టైం వరకు టికెట్​ వస్తదనే నమ్మకంతోనే పార్టీలో కొనసాగి, ఒకవేళ హైకమాండ్​ చివరి నిమిషంలో హ్యాండిస్తే అదే సానుభూతితో రెబెల్​గా మారి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు.