దేశంలో ఒక్కరోజే 75,760 కొత్త కరోనా కేసులు

దేశంలో ఒక్కరోజే 75,760 కొత్త కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజూకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది. తాజాగా గ‌త 24 గంట‌ల్లో 75,760 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. ఇంత భారీ మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దాంతో ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 33,10,235కి చేరింది. ఇందులో 7,25,991 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 56,013 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 25,23,772గా ఉంది. బుధవారం దేశవ్యాప్తంగా 1023 మంది కరోనాతో మ‌రణించారు. దాంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 60,472కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

బుధవారం దేశవ్యాప్తంగా 9,24,998 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 3,85,76,510 టెస్టులు చేసినట్లు తెలిపింది.

For More News..

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు

కార్యకర్తలకు న్యాయం చేయలేనపోతున్నానని లోక్ సభ ఎంపీ రాజీనామా