కరాచీ: పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లో పాకిస్తానీ హిందూ డెంటల్ స్టూడెంట్ చాందినీ హాస్టల్ రూమ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయం గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్న చాందినీ ఎంతసేపటికీ రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది తలుపులు పగలగొట్టి చూశారని, అప్పటికే మెడకు తాడుతో ఆమె మంచం మీద పడి ఉందని పోలీసులు చెప్పారు.
ఘోటకీకి చెందిన చాందినీ లార్కానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజిలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఘోటకీలో హిందువులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సింధ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ యాంటీ ఇస్లామిక్ కామెంట్స్ ద్వారా దైవదూషణ చేశారంటూ పేరెంట్ ఒకరు కంప్లైంట్ ఇవ్వటంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.