అమీన్పూర్, వెలుగు: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆదివారం అమీన్పూర్ పట్టణ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో హిందువులు నిరసనలు తెలిపారు. ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారులు సైతం ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదెల్లి రవీందర్, ఈర్లరాజు, మాణిక్యాదవ్, అంజిరెడ్డి, లక్ష్మణ్, పెంటేశ్, రాజేందర్గౌడ్, రాజ్కుమార్, రాకేశ్, ప్రసాద్, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
