హైదరాబాద్, వెలుగు: ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ ఆయా పరిసర ప్రాంతాల్లో భూముల లే అవుట్, ఇతరత్ర అనుమతులు ఉన్నాయా? లేవా అన్న వాటిపై క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికార యంత్రాంగాన్ని ఫీల్డులోకి దించింది. ఇప్పటికే గుర్తించిన అక్రమ వెంచర్లను వృద్ధిచేసిన బిల్డర్లు, రియల్టర్లు హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్నరా? లేక అక్రమంగా ప్లాట్ల క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారా? అన్న దాన్ని ఫీల్డు లెవల్ఆఫీసర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వెంచర్ల రియల్టర్లు, బిల్డర్లు, యాజమానులకు వాటికి సంబంధించి పర్మిషన్తీసుకునేలా ఈనెల 10వ తేదీ దాకా గడువు ఇచ్చింది. సిటీ చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ వెంచర్లకు అనుమతుల దరఖాస్తులతో భారీగా ఆదాయం సమకూర్చుకునే ప్లాన్ వేసింది.
టౌన్ప్లానింగ్తో
కార్పొరేషన్లు.. మున్సిపాలిటిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలను పరిశీలిస్తే హెచ్ఎండీఏ టౌన్ప్లానింగ్ డిపార్ట్ మెంట్తోనే ఆదాయం సమాకురే ఛాన్స్ఎక్కువగా ఉన్నది. ప్రధానంగా నిర్మాణ, లేఅవుట్అనుమతుల్లో అక్రమలు చోటు జరగకుండా ఉండేందుకు మూడేళ్ల కిందట డెవలప్మెంట్పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(డీపీఎంఎస్) విధానాన్ని హెచ్ఎండీఏ అందుబాటులోకి తెచ్చింది. టౌన్ప్లానింగ్విభాగంలో అమలవుతున్న ఈ సిస్టమ్హెచ్ఎండీఏ ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెడుతోంది. హెచ్హెండీఏ ఇటీవల నిర్వహించిన ఉప్పల్భగాయత్ ప్లాట్ల ఈ- వేలంతో రూ.677 కోట్లతో కాసుల పంట పండితే, డీపీఎంఎస్ విధానంతో రూ.170 కోట్ల రాబాడి వచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న హెచ్ఎండీఏ మరింత ఆదాయం పెంచుకునేలా ప్లాన్చేస్తోంది. గ్రేటర్లో ఎక్కడా స్థలాలు దొరకక్కపోవడంతో డెవలపర్లు, బిల్డర్లు, రియలర్టర్లు శివారులోనే ఎక్కువగా భూములు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా శివారు ప్రాంతాలకే భారీ ప్రాజెక్టులు వస్తుండడంతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఇందులో బిల్డింగ్పరిష్మషన్స్, లేఅవుట్గేటెడ్కమ్యూనిటీ, లేఅవుట్విత్హౌసింగ్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ), పెట్రోల్ పంప్ఆక్యూఫెన్సీ సర్టిఫికెట్, ఫైనల్ లేఅవుట్, ఓపెన్ ప్లాట్ వంటి అనుమతులను హెచ్ఎండీఏ ఆన్లైన్లోనే జారీ చేస్తోంది. వెంచర్లను డెవలప్ చేసిన కొంతమంది లేఅవుట్కోసం అనుమతులు తీసుకుంటుంటే, ఇంకొంతమంది నిబంధనలను పాటించుకుండా ఆదాయనికి గండికొడుతున్న అంశాన్ని హెచ్ఎండీఏ గుర్తించింది. దాంతో తాము చేపడుతున్న స్పెషల్ డ్రైవ్తో డెవలపర్లు, రియల్టర్లు, బిల్డర్లు, లేఅవుట్అనుమతులకు ముందుకు వస్తే హెచ్ఎండీఏకు ఆదాయం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
అనుమతులు లేకుంటే నోటీసులు
ఆదిబట్ల, వెలుగు: అనుమతులు లేని లే అవుట్లను గుర్తించి నోటీసులు జారీచేయనున్నట్లు ఆదిబట్ల మున్సిపల్కమిషనర్రాజేంద్రకుమార్ చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా డెవలప్చేసిన పలు లేఅవుట్లను హెచ్ఎండీఏ సహాయ ప్లానింగ్ అధికారి జ్ఞానేశ్వరాచారితో కలిసి గురువారం గుర్తించారు. ఏడు రోజుల్లో షోకాజ్ నోటీసుకు సమాధానం రాకుంటే వాటిని కూల్చివేస్తామని చెప్పారు.