రోప్వేకు ఆదిలోనే కష్టాలు..డీపీఆర్ తయారీలో ఇబ్బందులు

రోప్వేకు ఆదిలోనే కష్టాలు..డీపీఆర్ తయారీలో ఇబ్బందులు
  • సహకరించని రక్షణశాఖ, 
  • ఇతర శాఖల అధికారులు 

 హైదరాబాద్​సిటీ, వెలుగు : హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రోప్ వే ప్రాజెక్టుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖల అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఎలా ముందుకు పోవాలో తెలియక హెచ్ఎండీఏ సందిగ్ధంలో పడింది.

నగరంలో టూరిస్టులను ఆకట్టుకునేందుకు గోల్కొండ నుంచి కుతుబ్​షాహీ టూంబ్స్​వరకూ 1.5 కి.మీ. మేర రోప్​వే నిర్మించి కేబుల్​కార్​నడపాలని హెచ్ఎండీఏలోని ఉమ్టా ఆఫీసర్లు ప్లాన్లు వేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై డీపీఆర్​ఇవ్వాలని నైట్​ఫ్రాంక్​సంస్థను సెలెక్ట్​చేశారు. అయితే, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, భూసేకరణపై నివేదిక తయారు చేసేందుకు ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 

చర్చలకూ ఇష్టపడని రక్షణ శాఖ

గోల్కొండ నుంచి కుత్​షాహీ టూంబ్స్​వరకూ భూసేకరణ కష్టమైన వ్యవహారంగా మారింది. ఎందుకంటే లంగర్​హౌస్​లో ఆర్మీ ఆర్టిలరీ సెంటర్​ఉంది. ఇక్కడి ఆర్మీ సిబ్బంది గోల్కొండ కోట చుట్టూ ఫైరింగ్​తదితర ట్రైనింగ్​లో పాల్గొంటారు. దీంతో రక్షణ శాఖ అధికారులు కనీసం చర్చలు జరపడానికి కూడా ఇష్టపడడం లేదు. వీరితో పాటు ఆర్కియాలజీ, ఆర్​అండ్​బీ డిపార్ట్​మెంట్లు కూడా సర్వే పనులకు సహకరించడం లేదు.  

రోజుకు 10వేల మంది 

గోల్కొండ, కుతుబ్​షాహీ టూంబ్స్​ను చూడడానికి రోజుకు 10వేల మంది వరకు వస్తుంటారు. ఇందులో 2వేల మంది విదేశీయులు ఉంటున్నారు. హెచ్​ఎండీఏ అనుకున్నట్టు రోప్​వే ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండువైపులా కాఫీ షాప్​లు, ఫుడ్​కోర్టులు, ఎంటర్​టైన్​మెంట్​కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. కానీ, ఇప్పుడు డీపీఆర్​తయారీకి చేపట్టాల్సిన సర్వే పనులకే ఆయా శాఖల నుంచి సహకారం లభించకపోవడంతో అధికారులు ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు.