- 1.75 కి.మీ. పొడవున పనులు
- అదనపు లైన్ ఏర్పాటు
- అండర్పాస్లు, కల్వర్టుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధికి నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐటీ కారిడార్లో నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి మధ్య రోడ్లు చాలా ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి హెచ్ఎండీఏలోని హైదరాబాద్గ్రోత్కారిడార్అధికారులు ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఔటర్కు ఎడమ వైపు నుంచి నానక్రామ్ గూడ మీదుగా గచ్చిబౌలి వరకు ట్రాఫిక్సమస్య ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే మూసీ మీదుగా నార్సింగి, ఔటర్ కు రెండువైపులా కవర్చేస్తూ ఫ్లై ఓవర్కట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి రోడ్డును విస్తరించనున్నారు.
రూ.26.50 కోట్లతో పనులు
నానక్రామ్ గూడ నుంచి గచ్చిబౌలి వరకు 1.75 కి.మీ. పొడవున ఓఆర్ఆర్ ఎడమ ప్రధాన రహదారి విస్తరణ పనులను రూ.26.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగాఅదనపు లేన్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతమున్న అండర్పాస్లు, కల్వర్టుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టుకు సంబంధించి పరిపాలనా అనుమతులు లభించాయి. పనులు త్వరలో ప్రారంభించనున్నారు.
