
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలోని హోటళ్లు, హాస్టళ్లు, హాస్పిటళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర బహుల అంతస్తుల భవనాల నిర్వాహకులు తప్పకుండా సిల్ట్చాంబర్లు నిర్మించుకోవాలని నోటీసులు ఇస్తున్నట్లు వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి తెలిపారు. ఫుడ్, ఇతర వ్యర్థాలను నేరుగా సీవరేజీ నాలాల్లోకి పంపిస్తే ఎక్కడికక్కడ బ్లాక్అయ్యి, మ్యాన్హోళ్లు పొంగుతున్నాయని చెప్పారు.
నోటీసులు అందుకున్నాక కూడా సిల్ట్చాంబర్నిర్మించుకోకపోతే సీవరేజీ పైప్లైన్ కనెక్షన్ ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన స్పెషల్డ్రైవ్లో భాగంగా మెహిదీపట్నం, లంగర్ హౌజ్, టోలిచౌకి ప్రాంతాల్లో చేస్తున్న డీ-సిల్టింగ్ పనులను పరిశీలించారు. మెహిదీపట్నం అంబా థియేటర్ వద్ద మెయిన్రోడ్డుపై తరచూ పొంగుతున్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు.
టోలీచౌకిలో సీవరేజ్ అవుట్లెట్ లేని లైన్లను కొత్తగా నిర్మిస్తున్న జోన్- 3 సీవరేజ్ నెట్ వర్క్ కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూసీ నదికి నార్త్వైపున ఉన్న కోర్ సిటీలో సీవరేజ్వ్యవస్థ ఆధునీకరణకు జోన్ 3 సీవర్ నెట్వర్క్ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా రూ.297 కోట్ల ఖర్చుతో 129.32 కిలోమీటర్ల మేర పైపులైన్నిర్మాణాన్ని చేపడుతున్నారు. గోషామహల్, నాంపల్లి, కార్వాన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని సీవరేజీ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.