31 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు

31 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ కాలేజీలకు ఈనెల 31  నుంచి మే 31 వరకు సమ్మర్  హాలిడేస్  ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా ప్రకటించారు. ప్రైవేటు, ఎయిడెడ్, సర్కారుతో పాటు వివిధ మేనేజ్ మెంట్ల పరిధిలో కొనసాగే కాలేజీలన్నీ సెలవులు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాలిడేస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహించరాదని, షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే అడ్మిషన్లు జరపాలని సూచించారు.

కాగా, ఇంటర్  అకాడమిక్  క్యాలెండర్ లో  ఈనెల31 న లాస్ట్ వర్కింగ్  డే అంటూ పేర్కొన్నడంపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి తప్పుపట్టారు. ఇంటర్ బోర్డు అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఆదివారం లాస్ట్ వర్కింగ్ డే అని అకాడమిక్  క్యాలెండర్ రూపొందించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.