సైఫాబాద్, వెలుగు: ఆటోలో మర్చిపోయిన 6.5 తులాల బంగారు ఆభరణాలు, నగదును సైఫాబాద్ పోలీసులు గంట వ్యవధిలోనే బాధితురాలికి అందజేశారు. కర్నాటకకు చెందిన సుజాత అనే మహిళ శుక్రవారం నార్సింగి నుంచి బిర్లా మందిర్ వరకు ఆటోలో ప్రయాణించి, పొరపాటున తన బ్యాగ్ను అందులోనే వదిలేసింది. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి డ్రైవర్ నగేశ్ను సంప్రదించారు. డ్రైవర్ తన వద్ద ఉన్న బ్యాగ్ను నిజాయితీగా పోలీస్ స్టేషన్లో అప్పగించగా, సీఐ సీతయ్య దానిని బాధితురాలికి అందజేశారు.

