సరోజా వివేకానంద్​కు గౌరవ డాక్టరేట్

సరోజా వివేకానంద్​కు గౌరవ డాక్టరేట్

హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్​ ఎండీ, డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ ​విద్యాసంస్థల కరస్పాండెంట్​ సరోజా వివేకానంద్​కు అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సిటీ ఆఫ్​ సెంట్రల్ ​అమెరికా ఆమెకు గౌరవ డాక్టరేట్ ​ప్రకటించింది. డాక్టర్ బీఆర్ ​అంబేద్కర్ ​విద్యాసంస్థల ద్వారా అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ డాక్టరేట్ ​ప్రకటించారు. 

అణగారిన వర్గాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో కాకా వెంకటస్వామి 50 ఏండ్ల కింద అంబేద్కర్​ విద్యా సంస్థలను స్థాపించారు. డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి, కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేకానంద్​ కృషి చేస్తున్నారు. 

అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సరోజా వివేకానంద్​ పాటు పడుతున్నారని, అంబేద్కర్​ విద్యా సంస్థలకు ఆమె అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని యూనివర్సిటీ ఆఫ్ ​సెంట్రల్​ అమెరికా పేర్కొంది.