మహబూబ్ నగర్ పాలకొండ బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి తర్వాత హోటళ్లు, ధాబాలు మూసివేత

మహబూబ్ నగర్ పాలకొండ బైపాస్  రోడ్డుపై అర్ధరాత్రి తర్వాత  హోటళ్లు, ధాబాలు మూసివేత

పాలకొండ బైపాస్​ పక్కన హోటళ్లు, చాయ్​ దుకాణాలు రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన యువత పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి చేరుకొని టైం పాస్​ చేస్తున్నారు. రాత్రి 9 దాటాకా.. బైక్​లు వేసుకొని బైపాస్​ ఎక్కుతున్నారు. సైలెన్సర్ల నుంచి భయంకరమైన శబ్దాలు చేస్తూ బైక్​ రేసింగ్​లు పెట్టుకుంటున్నారు. మరికొందరు అక్కడక్కడా ఉన్న కల్వర్టుల వద్ద కూర్చొని సిగరెట్లు తాగుతూ వచ్చి పోయే వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొందరు బైపాస్​ వెంట ఏర్పాటు చేసిన రియల్  ఎస్టేట్​ వెంచర్లను సిట్టింగుల కోసం వినియోగించుకుంటున్నారు. 

ౌగత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేయడం లేదని అంటున్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్​ జరుగుతున్నా నామ్​కే వాస్తేగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. 

ఓపెన్​ కాక ముందే యాక్సిడెంట్లు

మహబూబ్​నగర్–​-చించోలి హైవేను కలుపుతూ నగరంలో కొత్తగా బై పాస్​ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బైపాస్​ పనులు ఇంకా పూర్తి కాలేదు. కొంత భాగం మిలిగి ఉంది. అయితే వాహనదారులు మాత్రం ఈ మార్గంలో ప్రయాణాలు చేస్తున్నారు. కర్నాటక, హైదరాబాద్​ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు.. ఈ మార్గంలో  120 నుంచి 140 కిలోమీటర్ల స్పీడ్​లో వెళ్తున్నాయి. 

ఇటీవల ఈ మార్గంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కొద్ది రోజుల కిందట వీరన్నపేట బైపాస్​ నుంచి జీప్​ యూ టర్న్​ తీసుకుంటుండగా.. అటు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రాంతంలో రెండు వారాల కింద ఆటోను జీపు ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్​లోనే చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.