ఇవాళ (జూన్ 20) రంగారెడ్డి జిల్లాలో హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం.. గజం బేస్ ధర రూ.45 వేలు

ఇవాళ (జూన్ 20) రంగారెడ్డి జిల్లాలో హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం.. గజం బేస్ ధర రూ.45 వేలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హౌసింగ్ బోర్డు శుక్రవారం రంగారెడ్డి జిల్లా లక్ష్మీగూడ గ్రామంలో 15 ప్లాట్స్‌‌‌‌‌‌‌‌కు వేలం నిర్వహించనుంది. ఒక్కో ప్లాట్ 213 నుంచి 313 గజాల విస్తీర్ణంలో ఉండగా.. గజం బేస్ ధర రూ.45,000గా నిర్ణయించారు. వేలంలో పాల్గొనే వారు రూ.5 లక్షల అడ్వాన్స్ చెల్లించాలి. వేలం లక్ష్మీగూడ కాలనీ సమీపంలో జరగనుందని అధికారులు పేర్కొన్నారు. 

అలాగే..ఈ నెల 23న మేడ్చల్ జిల్లాలోని చింతల్, గచ్చిబౌలి, నిజాంపేటల్లో కూడా వేలం పాట నిర్వహించనున్నారు. చింతల్‌‌‌‌‌‌‌‌లో 9 ప్లాట్స్ (266 గజాలు, గజం రూ.80,000), ఒక స్కూల్ (3,388 గజాలు) వేలం వేయనున్నారు. గచ్చిబౌలిలో 4 ప్లాట్స్‌‌‌‌‌‌‌‌లో 263, 315 గజాల రెండు ఇండ్లు, 1,487 గజాల కమర్షియల్ ప్లాట్, 1,206 గజాల స్కూల్ ఉన్నాయి. నిజాంపేటలో 413 గజాల 8 ప్లాట్స్ వేలంలో ఉన్నాయి. 

అదేవిధంగా..జూన్ 27న మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో 133, 266 గజాల 15 ప్లాట్స్‌‌‌‌‌‌‌‌ను గజం రూ.12,000 బేస్ ధరతో వేలం వేయనున్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో జులై 2న 220 నుంచి 359 గజాల ప్లాట్స్‌‌‌‌‌‌‌‌ను గజం రూ.65,000, రూ.75,000 ధరలతో వేలం నిర్వహిస్తారు. ఇటీవల కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో గజం రూ.2.98 లక్షలతో రికార్డు స్థాయిలో ప్లాట్స్ అమ్ముడైన నేపథ్యంలో.. గచ్చిబౌలి, నిజాంపేట, చింతల్‌‌‌‌‌‌‌‌లోనూ అధిక ధరలు పలుకుతాయని హౌసింగ్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.