
- బల్దియాకు రూ.360.37 కోట్ల అదనపు ఆదాయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో భారీగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టుతో పోలిస్తే ఈ సంవత్సరం ఐదు నెలల్లో 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి రూ.360.37 కోట్లు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇందులో1008 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉండగా, ఇన్ స్టంట్ రిజిస్ట్రేషన్ కేటగిరీలో194 బిల్డింగ్స్ కు పర్మిషన్ ఇచ్చారు.
ఇన్స్టంట్ అప్రూవల్ కేటగిరీ కింద 3,240 బిల్డింగ్స్ కు అనుమతులిచ్చి,161 ఓసీలు జారీ చేశారు. సింగిల్ విండో కేటగిరీ కింద 95 బిల్డింగ్స్కు అనుమతులివ్వగా, 847 ఓసీలు ఇష్యూ చేశారు. వీటి ద్వారా ఈ ఐదు నెలల్లో రూ.759.98 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయంలో చూస్తే కేవలం రూ.399.61 కోట్లు మాత్రమే వచ్చింది. గతేడాది మొత్తం టౌన్ ప్లానింగ్ విభాగానికి రూ.1,134.24 కోట్లు వచ్చింది. ఈ ఏడాది రూ.2 వేలకోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.