ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్త: పామెన భీమ్ భరత్ 

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్త: పామెన భీమ్ భరత్ 

చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ పామెన భీమ్ భరత్ తెలిపారు. గురువారం చేవెళ్లలోని కేజీఆర్ ఫంక్షన్ హాల్​లో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ఆయన  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ.. చేవెళ్లలో ఇప్పటికీ ఆర్టీసీ బస్సు డిపో  లేదని, సరైన ఆస్పత్రులు, మౌలిక వసతులు లేక జనం ఇబ్బంది పడుతున్నారన్నారు.

చేవెళ్ల ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య,మాజీ ఎమ్మెల్యే రత్నం అన్ని పదవులు అనుభవించారే తప్ప  సెగ్మెంట్​కు చేసిందేమీ లేదన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే చేవెళ్లను అభివృద్ధి చేసి చూపిస్తానని భీమ్ భరత్ తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.కార్యక్రమంలో సమన్వయ కమిటీ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజ, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

28న చేవెళ్లకు రానున్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 28న సాయంత్రం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేవెళ్లకు రానున్నట్లు  పామెన భీమ్ భరత్ తెలిపారు. చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్, నవాబ్ పేట మండలాలకు చెందిన పార్టీ సీనియర్​ నేతలు, నాయకులు, కార్యకర్తలు, బూత్​ స్థాయి లీడర్లు భారీగా తరలివచ్చి బస్సు యాత్రలో పాల్గొనాలన్నారు. చేవెళ్లలోని శంకర్​పల్లి చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుందన్నారు.