యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది.  తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివస్తున్నారు భక్తులు. దీంతో క్యూ లైన్ లో బారులు తీరారు. 

రద్దీ కారణంగా ఉచిత ధర్మదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా..  ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ప్రదేశం..కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని  ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.