కంటోన్మెంట్, వెలుగు: గులాబీ పార్టీతోనే కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ చార్జ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత విజయం లాంఛనమేనని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కీలక సమావేశంనిర్వహించారు. ఎన్నికల్లో అనురించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్యనాయకులకు సూచనలు చేశారు.
సాయన్న కుమార్తె లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. తెలంగాణ మాలల జేఏసీ చీఫ్ కో ఆర్డినేటర్ రావుల అంజయ్య ఆధ్వర్యంలో నేతలు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితకు ఆటోడ్రైవర్ల సంఘం జై కొట్టింది. లాస్యనందిత సమక్షంలో పలువురు ఆటోడ్రైవర్లు బీఆర్ఎస్ లో చేరారు. తేలుకుంట సతీశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.