ప్రజాభవన్ కు పోటెత్తిన ప్రజలు..

ప్రజాభవన్ కు పోటెత్తిన ప్రజలు..

హైదరాబాద్  జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజావాణికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు.  డిసెంబర్ 26వ తేదీ  మంగళవారం ఉదయం నుంచి ప్రజాభవన్ కు జనం క్యూ కడుతున్నారు.  ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే తరలివస్తుండడంతో వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు లోపలికి పంపిస్తున్నారు. తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు అధికారులు.  

ప్రతివారంలో మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం జరగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజాభవన్ కు మార్చి.. ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది.