నిరుద్యోగులు వందల సంఖ్యలో  నామినేషన్లు వేయండి

నిరుద్యోగులు వందల సంఖ్యలో  నామినేషన్లు వేయండి
  • హుజూరాబాద్‌ బరిలో నిలవాలని షర్మిల పిలుపు
  • పోటీ చేసే వాళ్లకు అండగా ఉంటామన్న వైఎస్సార్‌ టీపీ చీఫ్‌

హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికలో నిరుద్యోగులు వందల సంఖ్యలో నామినేషన్లు వేసి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడలు వంచాలని వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుణపాఠం చెప్పాలంటే ఇదే సరైన నిర్ణయమని శుక్రవారం ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. ఇకపై నిరుద్యోగుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసే వరకూ తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులు  వందల సంఖ్యలో చనిపోతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీపై రేపు, మాపు అంటూ ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. యువతకు వయసు అయిపోతున్నా సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శించారు.