డోరియన్​ హరికేన్​ విలయం

డోరియన్​ హరికేన్​ విలయం

హరికేన్​ డోరియన్​ ధాటికి శుక్రవారం నాటికి బహమాస్​లో 30 మంది చనిపోయారని ప్రధాని హుబెర్ట్​మిన్నిస్​ చెప్పారు. వేలాదిమంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కనీసం 70 వేల మంది అత్యవసర సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బహమాస్​తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయని వివరించారు. శిథిలాల నుంచి వెలికి తీస్తున్న మృతదేహాలను ఉంచేందుకు బాడీ బ్యాగ్స్, కూలర్లను పంపించినట్లు ఆరోగ్య మంత్రి డువానె సాండ్స్​చెప్పారు. సౌత్, నార్త్​ కరోలినాలో కరెంటు లేక 2 లక్షల 71 వేల మందికిపైగా చీకట్లో మగ్గుతున్నారని వివరించారు. నార్త్​కరోలినాలో గురువారం నుంచి పెనుగాలులతో పాటు కుండపోతగా వర్షం కురుస్తోందని అధికారులు చెప్పారు.