నీ దగ్గరకు నేనూ వస్తున్నా: భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకున్న భర్త

నీ దగ్గరకు నేనూ వస్తున్నా: భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకున్న భర్త

భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త ఆమె చితిలోకి దూకాడు. కుటుంబసభ్యులు రక్షించడంతో బావిలోకి దూకి ప్రాణం తీసుకున్నాడు.

టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని గోండ్‌ పిప్రి మండలం భాంగ్రామ్ తలోధి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.   కిషోర్ ఖాతిక్ ఈ ఏడాది మార్చి 19న  రుచితా చిట్టావర్ ను వివాహం చేసుకున్నాడు. అయితే గర్భవతిగా ఉన్న రుచితా తన తల్లి ఆరోగ్యం భాగలేదని, చూసి వస్తానంటూ పుట్టింటికి వెళ్లింది. నాలుగు రోజుల తరువాత రుచితాను మెట్టినింటికి తీసుకొచ్చేందుకు ఆమె భర్త కిషోర్ అత్తగారింటికి వెళ్లాడు.

అత్తగారింటికి వెళ్లిన కిషోర్ కు తన భార్య కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. అత్తమామల సాయంతో భార్యకోసం ఊరు మొత్తం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. అయితే ఊరికి దూరంగా ఉన్న బావిలో దూకి  తన భార్య రుచితా ఆత్మహత్య చేసుకుందన్న తెలుసుకున్న కిషోర్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ఎంతో గాఢంగా ప్రేమించే భార్య తనకు దూరమైందని గుండెలవిసేలా ఏడ్చాడు. తానుకూడా భార్య దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా  భార్య రుచిత కు దహన సంస్కారం చేశాడు. ఆమెను దహనం చేసిన చితిలోకి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కిషోర్ ను బయటకు తీశారు అయితే కిషోర్ భార్య మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. పదేపదే భార్యను గుర్తు చేసుకుంటూ కుమిలిపోయాడు.  తన భార్య ఆత్మహత్య చేసుకున్న బావిలోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య భర్తల మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.