బిడ్డ పెండ్లి కోసం భార్యతో గొడవపడి..

బిడ్డ పెండ్లి కోసం భార్యతో గొడవపడి..

మెదక్​ (చిన్నశంకరంపేట), వెలుగు: కూతురి  పెండ్లి విష యంలో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లగా మనస్తాపానికి గురైన భర్త మంగళవారం ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన చాకలి శేఖర్ (42), నర్సమ్మలకు ఇద్దరు పిల్లలున్నారు. శేఖర్ ​కూలి  పని చేస్తుంటాడు. వీరి బిడ్డ స్రవంతి పెళ్లీడుకొచ్చింది. సోమవారం రాత్రి కూతురి పెండ్లి చేయాలని నర్సమ్మ భర్తను కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగ్గా నర్సమ్మ కోపంతో తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనోవేదనకు గురైన శేఖర్ (42) పొలంవద్ద చెట్టుకు ఉరేసుకొని సూసైడ్​చేసుకున్నాడు. ఎస్సై మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.