శంషాబాద్ లో కిరోసిన్ పోసుకుని భర్త ఆత్మహత్య

శంషాబాద్ లో కిరోసిన్ పోసుకుని భర్త ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్మీయా గూడకు చెందిన 45 ఏళ్ల సుజిత్ నాయక్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుస్మిత, పిల్లలతో పాటు గత పదేళ్లుగా అక్కడే కిరాయి ఇంట్లో నివసిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన సుజిత్ నాయక్ కొద్ది రోజులుగా రోజూ గొడవ పడుతుండే వాడు. నిన్న(శుక్రవారం) కూడా ఫుల్ గా మందు తాగి ఇంటికి వచ్చాడు. ఎలాగైనా తన భర్త గొడవ చేస్తాడని అనుకున్న భార్య సుస్మిత…తన పిల్లలను తీసుకుని పక్కింటికి వెల్లింది. రాత్రి అక్కడే నిద్రించి…మరుసటి రోజు తెల్లవారు జామున ఇంటికి వెళ్లింది. ఇంటి లోపలికి వెళ్లే సరికి భర్త సజీవదహనమై కన్పించాడు. భార్య సుస్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరిపైనా అనుమానం లేదని….తాగిన మైకంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.