
పెళ్లంటే నూరేళ్ల పంట.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకోవాలి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అబ్బాయి హిస్టరీ ఏంటి.. అన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని పెద్దలు అంటుంటారు. వాళ్లు ఊరికే అనలేదు.. అది అక్షరాలా నిజం అని ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది. సోషల్ మీడియా పరిచయం.. ప్రేమగా మారి.. తల్లి దండ్రుల మాట వినకుండా పెళ్లి చేసుకుని.. తన చావును తానే తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ఓ అభాగ్యుడి జీవిత కథ ఇది.
బాయ్ ఫ్రెండ్ తో కలిసి కట్టుకున్న భర్తను టార్చర్ పెట్టింది ఓ ఇల్లాలు. పోలీస్ అయిన తన లవర్ అండ చూసుకుని చుక్కలు చూపించింది. మామను చంపమని.. అదే భర్త తండ్రిని చంపమని.. చివరికి సూసైడ్ చేసుకునేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మగాన్ అలియాస్ అజయ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతని భార్య దివ్య, పోలీస్ ఇన్ స్పెక్టర్ అయిన ఆమె లవర్ దీపక్ తో కలిసి టార్చర్ చేశారని.. తట్టుకోలేక.. జీవితంపై ఆశలు లేక చనిపోతున్నట్లు వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మగాన్ చనిపోయే ముందు అతనికి భార్య నుంచి ఒక వీడియో వచ్చింది. ఆమె తన లవర్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో పంపి రాక్షసానందం పొందింది. ఇద్దరు చెప్పలేనంత వెకిలి చేతలతో డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి పంపారు. లవర్ వీడియో తీస్తుంటే ఆమె డ్యాన్స్ చేసిన వీడియో అది. దివ్య ఆ వీడియోను స్వయంగా తమ కొడుకుకు పంపిందని మగాన్ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఆ తర్వాతనే మగాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
మా నాన్నను చంపలేను..
మగాన్ సూసైడ్ చేసుకునే ముందు వీడియో తీశాడు. ఎలాగైనా పోలీసులకు చేరుతుందని.. నిజాలు బయటపడాలని వీడియో తీసి చనిపోయాడు. తన భార్య దివ్య, పోలీస్ ఆఫీసర్ దీపక్ తనను మెంటల్ గా హరాస్ చేశారని వీడియోలో తెలిపాడు. దిత్య తన లవర్ దీపక్ కు ప్రమోషన్ కోసం భూమిని అమ్మి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు చెప్పాడు. భూమి అమ్మటానికి తన తండ్రి ఒప్పుకోకుంటే ఆయనను కూడా చంపేయమని బెదిరించినట్లు చెప్పాడు.
మా నాన్నను చంపలేను.. భూమిని అమ్మలేను.. నేనే చనిపోతున్న.. ’’ అంటూ ఏడుస్తూ.. ఎంతో ఎమోషనల్ గా వీడియో రికార్డ్ చేశాడు. వాళ్లిద్దరి పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. తమ తల్లిదండ్రులను కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
జూన్ 18న దోభ్ గ్రామంలో ఉరివేసుకుని మగాన్ చనిపోవడం సంచలనం సృష్టించింది. ఈ సూసైడ్ వెనుక ఉన్న దారుణ హరాస్మెంట్ ను వీడియో ఆధారంగా పోలీసులు ఛేదించారు. తన చావుకు కారణం భార్య దివ్య, ఆమె లవర్ దీపక్ అని స్పష్టంగా చెప్పాడు.
ముందే పెళ్లైంది.. తర్వాత తెలిసి షాకయ్యా..
‘‘గోధుమలు అమ్మి ఒకటిన్నర లక్షలు ఇచ్చా.. బ్రేస్లెట్ కుదువపెట్టి రెండు లక్షలు ఇచ్చా.. మొత్తం రూ.3.50 లక్షలు ఇచ్చానా కూడా మరో లక్షన్నర కావాలని టార్చర్ చేసింది..’’ అని వీడియోలో చెప్పాడు. దీపక్ ఔరంగాబాద్ లోని సంభాజినగర్ లో విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పాడు.
తన భార్యకు ముందే పెళ్లైనట్లు ఒకటిన్నర సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత తెలుసుకున్నట్లు చెప్పాడు మగాన్. ఆమెకు అప్పటికే ఒక కొడుకు కూడా ఉన్నాడని.. ఇవేవీ చెప్పకుండా.. డైవర్స్ తీసుకోకుండా మోసం చేసి పెళ్లి చేసుకుందని తెలిపాడు. ఈ విషయంపై లాయర్ ను సంప్రదించగా.. హిందూ వివాహ వ్యవస్థలో డైవర్స్ తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదని.. కేసు వేయాల్సిందిగా లాయర్ సలహా ఇచ్చినట్లు తెలిపాడు. కానీ తాను ఎప్పుడూ కేసు వేయలేదని.. దానికి బదులు ఆమెకు డబ్బులు ఇచ్చినప్పటికీ ఘోరంగా టార్చర్ చేసిందని వీడియోలో వివరంగా చెప్పాడు.
మహిళలకే కాదు.. పురుషులకు అన్యాయం జరిగితే కూడా స్పందించండి..
తన భార్య దివ్య చెల్లి సవితా ఆర్య పానిపట్ లో పనిచేసే ఒక మహిళా సంఘం నేత అని.. ఆడవాళ్లకు చిన్న సమస్య వచ్చినా కన్నీళ్లు పెడుతుందని తెలిపాడు. ఆమెకు ఈ విషయం చేరాల్సిందిగా కోరాడు. ఆడవాళ్లకు సమస్య వస్తే ఏడవటమే కాదు.. మగవాళ్లకు అన్యాయం జరిగితే కనీసం ఒక కన్నీటి చుక్కనైనా రాల్చమని ఆమెకు సలహా ఇచ్చారు. అన్యాయానికి ఆడ, మగ అనే తేడా లేదని.. ఎవరికి జరిగినా దారణంగా ఉంటుందని చెప్పాడు.
వీడియోలో రోహ్తాక్ ఎంపీ దీపేందర్ హుడా, మేహం ఎమ్మెల్యే బలరాం దంగి లను ఉద్దేశించి తన చివరి కోరిక కోరాడు. ‘‘మా అమ్మ నాన్నకు ఒకే ఒక్క కొడుకైన నేను చనిపోతున్నా. నా కొడుకు మా పేరెంట్స్ దగ్గరే ఉండేలా చూడండి. వాడిలో నన్ను చూసుకుంటారు. వాడు మా పేరెంట్స్ కు తోడుంటాడు. ఆ మోసకారి దగ్గరకు పంపొద్దు. నేను లేకపోయినా నా కొడుకు ఉన్నాడనే తృప్తిని మా పేరెంట్స్ కు మిగల్చండి.. ప్లీజ్’’ అంటూ వేడుకున్నాడు.
అయితే మెగాన్, దివ్యలకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని.. తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు మెగాన్ పేరెంట్స్ చెప్పారు. ముందు దీనికి తాము అంగీకరించలేదని.. బాబు పుట్టిన తర్వాత ఒప్పుకున్నట్లు చెప్పారు. దివ్యకు జాబ్ ఉండేదని.. కానీ ఎప్పుడూ తమకు చెప్పలేదని అన్నారు. మధ్య మధ్యలో ఫ్యామిలీకి దూరంగా ఉండేదని.. దీపక్ ను కలిసేందుకే కావచ్చునని తెలిపారు.
2025 మార్చి 20న దివ్య వర్క్ ఉందని వెళ్లిందని.. ఆ తర్వాత ఎప్పుడూ తిరిగిరాలేదని తెలిపారు. ఫోన్ లో తమ కొడుకు మగాన్ తో టచ్ లో ఉందని.. డబ్బుల గురించి వేధించి టార్చర్ చేసినట్లు చెప్పారు. దివ్య కోసం పోలీసులు వెదుకుతున్నారని, ఆమె మొబైల్ నెంబర్ ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
"So many laws are there for women. But nothing is there for Men. I am dying by suicide because of torture by my wife Divya & her lover Deepak.
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 23, 2025
Only child of my parents will be gone. I request authorities to give my child to my parents & book these two people for my Murder"… pic.twitter.com/1USFNPVxAB