జగిత్యాలలో భార్యాభర్తల గొడవ..అడ్డువచ్చిన వ్యక్తిపై కాల్పులు

జగిత్యాలలో భార్యాభర్తల గొడవ..అడ్డువచ్చిన వ్యక్తిపై కాల్పులు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో భార్యభర్తల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది. భార్యపై కాల్పులు జరపగా అడ్డువచ్చిన వ్యక్తికి బుల్లెట్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.  మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన గీతికి, శ్రీనివాస్ రెడ్డి భార్యభర్తలకు గత కొంత కాలంగ నుంచి గొడవలు జరుగుతున్నాయి. భార్య ఇద్దరి పిల్లలతో కలిసి  కొన్ని రోజులుగా ఇస్రాస్ పల్లిలోని ఆమె మేనమామ రాజిరెడ్డి వద్ద ఉంటుంది. సోమవారం రాత్రి భార్య వద్దకు వెళ్లిన శ్రీనివాస్ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ విషయం ఆమె మేనమామ రాజిరెడ్డికి తెలవగానే వచ్చాడు. దీంతో శ్రీనివాస్ తన వెంట తెచ్చిన తుపాకీతో  కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆమె మేనమామ రాజిరెడ్డికి రెండు బుల్లెట్టు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.