వేధింపుల భర్తకుఏడాది జైలు

వేధింపుల భర్తకుఏడాది జైలు

హైదరాబాద్, వెలుగు: నిత్యం భార్యను వేధిస్తున్న ప్రబుద్ధుడికి ఏడాది జైలు, రూ. 2 వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్‍ 14వ మెట్రోపాలిటన్‍ కోర్టు జడ్జి సోమవారం తీర్పు వెలువరించారు. బస్వరాజు సంధ్యారాణి, సాయి కృష్ణతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నెల నుంచే భార్యను సాయికృష్ణ వేధించడం మొదలు పెట్టాడు. గర్భవతి అయినా.. తీరు మార్చుకోలేదు. ఆడ పిల్లను కనొద్దంటూ గొడవచేసి ఇంట్లోంచి గెంటేశాడు. బాధితురాలు సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించగా, సోమవారం కోర్టు శిక్ష విధించింది.