అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

అనుమానంతో కట్టకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త.  ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లా బనగానపల్లే మండలంలోని  టంగుటూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, ఏలేశ్వరి దంపతులు. ప్రసాద్ రెడ్డి పెళ్లిళ్లకు షామియానా సరఫరా చేస్తూ, ఓ ఫోటో స్టూడియోని కూడా నిర్వహిస్తున్నాడు.

కారణాలు తెలియదు కానీ అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానాలు , ఫలితంగా మనస్పర్ధలు, గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన ప్రసాద్ రెడ్డి..  బుధవారం వేకువజామున ఇంట్లో  నిద్రిస్తున్న భార్య మల్లేశ్వరి పై రోకలిబండ తీసుకొని తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ప్రసాద్ రెడ్డి అక్కడ్నుంచి పారిపోయాడు.  రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి  భయాందోళనకు గురైన వారి పిల్లలు చుట్టు పక్కల వారికి తెలిపారు.   స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న నందివర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు