అనుమానంతో భార్యను చంపిన భర్త

అనుమానంతో భార్యను చంపిన భర్త

హైదరాబాద్: అనుమానంతో భార్యను చంపాడు ఓ వ్యక్తి. ఈ దారుణ సంఘటన ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ లో జరిగింది.కంచన్ బాగ్ లోని హఫిజ్ బాబానగర్ లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతుండేవారు. ఆదివారం రాత్రి కూడా భార్యతో గొడవకు దిగన భర్త ఆమెను కూరగాయలు కోసే కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

స్థానికుల సమాచం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త పరారీలో ఉన్నాడని తెలిపిన పోలీసులు.. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా హస్పిటల్ కి తరలించామని చెప్పారు. భర్త తరుచుగా భార్యను అనుమానించేవాడని స్థానికులు చెబుతున్నారని తెలిపారు పోలీసులు.