ప్రజాపాలనను సక్సెస్​ చేయాలె : రజిత

ప్రజాపాలనను సక్సెస్​ చేయాలె : రజిత
  •     హుస్నాబాద్​ మున్సిపల్ చైర్ ​పర్సన్​ రజిత

హుస్నాబాద్, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజాపాలనను సక్సెస్​ చేయాలని హుస్నాబాద్​ మున్సిపల్​చైర్​పర్సన్​ఆకుల రజిత సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు కోసం గురువారం నుంచి నిర్వహించబోయే ప్రజాపాలనపై  బుధవారం కౌన్సిల్​ సమావేశంలో చర్చించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దరఖాస్తుదారులు ఇబ్బంది  పడకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్హులైనవారందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. దరఖాస్తు ఫారాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వీకరిస్తారని, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీసుకుంటారన్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో దరఖాస్తులు తీసుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.