- ఒక ఎస్ఐ, ఏడుగురు సిబ్బంది నియామకం
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ పోస్ట్కు ఎస్ఐ శ్రీనివాస్తో పాటు ఏడుగురు సిబ్బందిని కేటాయించారు. మల్లెచెట్టు, అంబేద్కర్ చౌరస్తా, అక్కన్నపేట రోడ్డుల్లో ట్రాఫిక్ జామ్లను నియంత్రించనున్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు కోర్టుకు పంపుతామని, నిబంధనలు అతిక్రమించే వారిపై ఈ-చలాన్లు విధిస్తామని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
