తార్నాక, వెలుగు: అమెరికాలో హత్యకు గురైన గొడిశాల నిఖిత మృతదేహం శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్నది. గత నెల 31న మేరీ ల్యాండ్ లోని కొలంబియా ప్రాంతంలోని ఆమె ఫ్రెండ్ అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్బాడీని పోలీసులు గుర్తించారు. నిఖిత వాహనం కూడా అక్కడే ఉంది. నిఖిత శరీరంపై అనేక కత్తిపోట్లు గుర్తించారు. డిసెంబర్ 31న సాయంత్రం 7 గంటల సమయంలో హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
అర్జున్ శర్మ గురించి వెతకగా అతడు ఇండియా పారిపోయి వచ్చాడని సమాచారం దొరికింది. అయితే, నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పలు మీడియాల్లో వచ్చాయి. అయితే, దీన్ని నిఖిత కుటుంబసభ్యులు ఖండించారు. నిందితుడు అర్జున్ శర్మ ఇంకా పరారీలోనే ఉన్నాడని తెలిపారు. అతన్ని అరెస్టు చేశారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. నిఖిత మృతదేహం శుక్రవారం హైదరాబాద్ రానుందని, అంత్యక్రియల కోసం పోలీస్ప్రొటెక్షన్ కోరామని చెప్పారు.
