ముగ్గురు ద్విచక్రవాహన దొంగలను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన ఆరు ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు మహ్మద్ అజీజ్, మెహ్రాజ్ షరీఫ్, మహ్మద్ జానీలు గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
నిందితులు దొంగతనాలకు పాల్పడి వాహనాలను తక్కువ ధరకు విక్రయించి డబ్బు సంపాదించేవారని పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్ట్ అనంతరం.. వారిని కోర్టులో హాజరుపరిచి పోలీసులు రిమాండ్కు తరలించారు.