ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి విదేశాలకు పెరుగుతున్న డైరెక్ట్ ఫ్లైట్స్..

ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి విదేశాలకు పెరుగుతున్న డైరెక్ట్ ఫ్లైట్స్..

Hyderabad News: ప్రస్తుతం హైదరాబాద్ నగరం ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన నగరాలకు ధీటుగా విస్తరిస్తోంది. ప్రపంచ పెట్టుబడులకు సైతం మెుదటి ఎంపికగా మారిపోయిన హైదరాబాద్ ఐటీ నుంచి డేటా వరకు అనేక టెక్ పెట్టుబడుకులకు ప్రపంచ రాజధానిగా మారిపోయింది. దీంతో నిరంతరం విదేశాల నుంచి బిజినెస్ ట్రిప్స్ కోసం వస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న వేళ విమాన ప్రయాణ సేవల విస్తరణకు మెగా ప్లాన్ జరుగుతోంది. 

హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా జపాన్ లోని కిటాక్యుషు మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేయర్ కజుహిసా టకేచి నేతృత్వంలోని కిటాక్యుషు ప్రతినిధి బృందం సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి రంగాల్లో సహకారానికి కిటాక్యుషుతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఎంవోయూ కుదుర్చుకుంది. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం స్థిరమైన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూ వినూత్న ప్రాజెక్టులను చేపడుతోందని ఇందుకోసం కొత్త ప్రపంచ స్థాయి భాగస్వాములతో చేతులుకలుపుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

హైదరాబాద్ నగరం నుంచి వివిధ అంతర్జాతీయ నగరాలకు ప్రత్యేక విమాన సేవల జాబితా..
1. దుబాయ్- యూఏఈ
2. మస్కట్- ఒమన్
3. దోహా- ఖతార్
4. అబుదాబి- యూఐఈ
5. జెడ్డా- సౌదీ అరేబియా
6. సింగపూర్
7. కౌలాలంపూర్- మలేషియా
8. డమ్మామ్- సౌదీ అరేబియా
9. షార్జా- యూఏఈ
10. రియాద్- సౌదీ అరేబియా
11. కువైట్
12. కలొంబో- శ్రీలంక
13. బహ్రెయిన్
14. లండన్- యూకే
15. ఢాకా- బంగ్లాదేశ్
16. హాంకాంగ్
17. ఫ్రాంక్ఫట్- జర్మనీ
18. బ్యాంకాక్- థాయిలాండ్
19. మాలీ- మాల్దీవులు
20. రసల్ ఖైమా- యూఏఈ

ప్రస్తుతం హైదరాబాదు నుంచి నేరుగా అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ కారణంగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో దుబాయ్ అత్యధికంగా 93వేల ప్రయాణికుల రద్దీని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కలిగి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ విమానాశ్రయం 2కోట్ల 13 లక్షల మంది ప్రయాణికుల రద్దీని చూడగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇది 3 కోట్ల ప్రయాణికులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య పెరుగుతలతో 15.20 శాతం గ్రోత్ నమోదైంది.