
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియపై స్పీడ్ పెంచింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నిర్వహణకు ఆగస్టు 25న నోడల్ అధికారులను నియమించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నిక షెడ్యూల్ రానప్పటికీ ఉప ఎన్నిక హీట్ మొదలైంది. పార్టీలు ఇంకా అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అయితే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.
నోడల్ అధికారులు
- మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ – ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి
- ఈవీఎం & వివిప్యాట్ నిర్వహణ – కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌవన్
- ట్రైనింగ్ – ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్
- ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ – సి.టి.ఓ శ్రీనివాస్
- మెటీరియల్ మేనేజ్మెంట్ – అడ్మిన్ అదనపు కమిషనర్ కె. వేణుగోపాల్
- ఎంసిసి – అడిషనల్ ఎస్పి (విజిలెన్స్) ఎం. సుదర్శన్
- లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ – డిఎస్పి నరసింహా రెడ్డి
- ఎక్స్ పాండిచర్ మానిటరింగ్ – చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర్ రెడ్డి
- ఎన్నికల పరిశీలకులు – అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్
- డమ్మీ బ్యాలెట్ పేపర్ – సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్
- మీడియా కమ్యూనికేషన్ & ఎంసిఎంసి – సిపిఆర్ఓ సెక్షన్ పిఆర్ఓ దశరథ్
- సైబర్ సెక్యూరిటీ, ఐటి & కంప్యూటరైజేషన్ – ఐటి జాయింట్ కమిషనర్ సి. రాధా
- హెల్ప్లైన్ & కంప్లైంట్ రీడ్రెస్సల్ – ఐటి ఏఈ కార్తీక్ కిరణ్
- వెబ్కాస్టింగ్ – ఐటి ఏఈ తిరుమల కుమార్