- గోవా నుంచి డ్రగ్స్తెచ్చుకున్న ఓ సిమెంట్వ్యాపారి కూడా..
మాదాపూర్, వెలుగు: బెంగుళూరు నుంచి నగరానికి డ్రగ్స్తెప్పించుకున్న ఇద్దరు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణమోహన్తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన భరత్రెడ్డి ట్రావెల్ వ్లాగర్గా చేస్తున్నాడు.
హయత్నగర్కు చెందిన రాకేశ్ నగరంలో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇద్దరికీ ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉండటంతో ఈ నెల 26న రాత్రి బెంగళూరు నుంచి ఎండీఎంఏ తెప్పించుకొని, మాదాపూర్అయ్యప్ప సొసైటీలో రిసీవ్చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. భరత్రెడ్డిపై ఇదివరకే మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. రాకేశ్ ఎండీఎంఏను విక్రయించేందుకు తెప్పించుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్చేశామన్నారు.
రాయదుర్గం పరిధిలో..
ఎంజాయ్ చేసేందుకు గోవాకి వెళ్లి, వచ్చేటప్పుడు డ్రగ్స్తెచ్చుకున్న ఓ సిమెంట్ వ్యాపారిని మాదాపూర్ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్చేశారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన స్రికిరెడ్డి పృథ్వీ గతంలో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే తండ్రికి క్యాన్సర్రావడంతో తిరిగి సొంతూరుకు వచ్చాడు. నెల్లూరులోనే ఉంటూ సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో డ్రగ్స్కు అడిక్ట్ అయిన పృథ్వీ.. ఫ్రెండ్స్తో కలిసి తరచూ గోవా వెళ్తున్నాడు. అక్కడినుంచి డ్రగ్స్ తెచ్చుకొని హైదరాబాద్లేదా సొంతూరుకు వెళ్తున్నాడు. ఈ నెల 26న గోవా నుంచి డ్రగ్స్తో నగరానికి వచ్చిన పృథ్వీ గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు వెళ్లి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
11.27 గ్రాముల గంజాయి, 1.32 గ్రాముల ఓజీకుష్, 1.43 గ్రాముల 3 ఎండీఎంఏ పిల్స్ను స్వాధీనం చేసుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. పృథ్వీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
