పద్మారావునగర్,వెలుగు: హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వెంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన(88) వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ నెల 21న మృతిచెందారు. ఆమె డెడ్బాడీని కుటుంబసభ్యులు సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి బుధవారం అప్పగించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు సోదరి అయిన సుమన హైదరాబాద్లోని ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. 2011 నుంచి 2021 వరకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఫరూఖ్నగర్ మండలం బూర్గుల సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేశారు. ప్రగతి వెల్ఫేర్ అసోషియేషన్ను ఏర్పాటు చేసి పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. మరణాంతరం తన డెడ్బాడీని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించాలని వీలునామా రాశారు.
