- కెమెరాలు పెట్టి ఏఐతో మానిటరింగ్
- ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే దొరికిపోవుడే
- రూ.7.58 కోట్లతో ప్రాజెక్టు
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలోని పీవీఎన్ఆర్ఎక్స్ప్రెస్వేపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్రూల్స్పాటించేందుకు హెచ్ఎండీఏ కొత్త ప్లాన్తో ముందుకు వచ్చింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ఎయిర్పోర్ట్వరకూ 14 కి.మీ. మేర ఉన్న ఫ్లైఓవర్పై కొందరు ట్రాఫిక్రూల్స్బ్రేక్చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుండడంతో మల్టీవయలేషన్డిటెక్షన్సిస్టమ్(ఎండీఎస్) ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా ఫ్లైఓవర్పై కెమెరాలు ఏర్పాటు చేసి ఏఐ ద్వారా వాహనాల స్పీడ్, స్లో మూవ్మెంట్, రాంగ్వే, జిగ్జాగ్ డ్రైవింగ్, మొబైల్ఫోన్డ్రైవింగ్, రోడ్డు లేన్రూల్స్పాటించకపోవడం, సీట్బెల్ట్పెట్టుకోకపోవడం, రివర్స్డైరెక్టర్, ఫాగ్, స్మోక్ వంటి వాటని మానిటర్చేసి ఫొటోలు తీయనున్నారు.
5 నెలల్లో ప్రక్రియ పూర్తి
పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేపై ఏర్పాటు చేసే ఎండీఎస్ కు దాదాపు 7.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి డిజైన్, కెమెరాల ఏర్పాటు, టెస్టింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్వారే నిర్వహించేలా ప్రతిపాదనలు రూపొందించారు. వచ్చే 5 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి ఐదేండ్ల పాటు సదరు ఏజెన్సీనే మెయింటెయిన్చేసేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇందులో ఉపయోగించే సింగిల్5 ఎంపీ గ్లోబల్షట్ట ర్కెమెరాలు అన్ని రకాల ఫొటోలను క్లియర్గా, 95 శాతానికి పైగా ఆక్యురెసీతో తీస్తుందన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్చేసే వారు, రూల్స్పాటించని వారిని సులభంగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.
