ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి

ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచేశాయి. ఏప్రిల్ 25వ తేదీ గురువారం ఎన్నికలకు నామినేషన్ చివర రోజు కావడంతో పలు ఎంపీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ వేశారు. అయితే, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఓ వ్యక్తి వినూత్నంగా నామినేషన్ వేశాడు. నామినేషన్ కేంద్రానికి అతను ఒంటెపై ఎక్కి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంకేముంది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వినూత్న నామినేషన్ తో .. అతని గురించి మాట్లాడుకునేలా చేశాడు.

కాగా, హైదరాబాద్ లోక్ సభ స్థానానికి ఈ సారి గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది. ఎంఐఎం కంచుకోటగా వస్తున్న ఈ స్థానంపై బీజేపీ కన్నేసింది. ఇందులో భాగంగానే విరించి ఆస్పత్రి ఓనర్ మాధవిలతను ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి బరిలో దింపింది. ఇక, ఆమె తనదైన స్టైల్లో జోరుగా ప్రచారం చేస్తూ దూసుకుపోతోంది. మరి, ఈ ఎన్నికల్లో ఓవైసీకి బీజేపీ చెక్ పెడుతుందో  లేదో చూడాలి.