మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలో.. మే 29న జాబ్ మేళా

మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలో.. మే 29న జాబ్ మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్​జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.వందన తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 29న జాబ్ మేళా ఉంటుందన్నారు. 

టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు గురువారం ఉదయం 11 గంటలకు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు www.employment.telangana.gov.in లేదా 9963758829, 8328428933 నెంబర్లను సంప్రదించాలన్నారు.