కూతురు లేని లోకంలో ఉండలేను..కన్న బిడ్డ దూరమైందని..సూసైడ్ చేసుకున్న తండ్రి

కూతురు లేని లోకంలో ఉండలేను..కన్న బిడ్డ దూరమైందని..సూసైడ్ చేసుకున్న తండ్రి

కూతురికి నాన్నంటే ఎనలేని ఇష్టం.. నాన్నకు కూతురంటే ప్రాణం.. అల్లారుముద్దుగా పెంచుకున్న తన పాప ఏది అడిగినా క్షణాల్లో తెచ్చి ఇచ్చేవాడు నాన్న.. ఒకరిని విడిచి మరొకరు ఎప్పుడూ ఉన్నది లేదు.. తన పాప స్కూల్ కు వెళ్తుంటే.. నాన్న బాధపడేవాడు.. కూతురికి ఆరోగ్యం బాగా లేదని తెలిసినప్పటి నుంచి నాన్న ఏడవని రోజు లేదు.. పాప ఆరోగ్యం మెరుగుపడాలని మొక్కని దేవుడు లేడు.. అనారోగ్యంతో కూతురు బాధపడుతుంటే.. చెప్పలేనంత ఆవేదనకు గురయ్యేవాడు... చివరికి తన ఐదేళ్ల కూతురిని దక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన పాప ప్రాణం దక్కలేదు.. దీంతో ఆవేదన తట్టుకోలేక పాప లేని లోకంలో నేను ఉండలేనని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో జరిగింది. 

ఖైరతాబాద్ లో నివాసముంటున్న కిషోర్ దంపతులకు ఐదేళ్ల పాప ఆరాధ్య ఉంది. అందరిలాగే తాను రోజు ఆడుకుంటూ.. స్కూల్ కు వెళ్తూ ఉండేది. ఏమైందో ఏమోగాని అల్లారుముద్దుగా పెంచుకున్న పాప అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో తన కూతురు మృతిని తట్టుకోలేక తండ్రి కిషోర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలోకి వెళ్లిపోయి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.