
- ముందుగా పార్టీల్లో ఖాళీ అయిన మద్యం బాటిల్స్ సేకరణ
- చీప్ లిక్కర్ నింపి తక్కువ ధరకు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
- 7 మద్యం..106 ఖాళీ బాటిల్స్ ఎక్సైజ్ పోలీసుల స్వాధీనం
హైదరాబాద్ సిటీ , వెలుగు : ఖరీదైన మద్యం ఖాళీ బాటిల్స్ సేకరించి అందులో చీప్ లిక్కర్ నింపి అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్డీ టీమ్ పట్టుకుంది. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్ కాచిగూడ పరిధి ఉస్మాన్సాగర్కు చెందిన గొరికి శ్రీనివాస్ రెండు, మూడేండ్లుగా ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి తక్కువ ధరకు ఇస్తున్నానని అమ్ముతూ మోసగిస్తున్నాడు. ముందుగా పార్టీలు జరిగిన చోటకు వెళ్లి ఖాళీ బాటిళ్లను తీసుకుంటాడు. వాటిని తెచ్చి తన ఇంట్లో చీప్ లిక్కర్తో నింపి అమ్ముతున్నాడు.
సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ డీ టీమ్ సీఐ నాగరాజు, ఎస్ఐ జ్యోతి ఉస్మాన్నగర్ పల్టాన్ రోడ్డులోని శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశారు. ఏడు కల్తీ మద్యం బాటిళ్లు, 106 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 100 పైపర్, షివాస్ రీగల్ వంటి ఖరీదైన బాటిళ్లలో తక్కువ ధరల మద్యాన్ని నింపినట్లు గుర్తించారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న బాటిళ్లను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. లిక్కర్ తయారీదారుడిని పట్టుకున్న ఎస్ టీఎఫ్ డీ టీమ్ను ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ ను డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ , డీఎస్పీ తిరుపతి యాదవ్ అభినందించారు.