వీధి కుక్కను తప్పించబోయిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బైక్ నుంచి కిందపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని పహాడీషరీఫ్లో జరిగింది.
మామిడిపల్లి గ్రామానికి చెందిన కె.దీపక్ కుమార్ (29) మామిడిపల్లి నుంచి ఉప్పుగూడకు స్కూటీపై వెళ్తున్నాడు. అతను పహాడీషరీఫ్లోని అల్ అద్రోస్ స్కూల్కు చేరుకున్నప్పుడు, అతని స్కూటర్ ముందు ఒక వీధి కుక్క వచ్చింది .. కుక్కను తప్పించబోయి దీపక్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. అతని స్కూటర్ అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.