మంచిరేవుల ఫారెస్ట్ పార్కు ఓపెన్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

మంచిరేవుల ఫారెస్ట్ పార్కు ఓపెన్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ హరితహారం అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్​చుట్టుపక్కల ఐదు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా మంచిరేవులలో ఫారెస్ట్‌ ట్రెక్‌ ​పార్కును ముఖ్యమంత్రి కేసీఆర్​ప్రారంభించి, కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నార్సింగి పోలీస్​అకాడమీ, అప్పా జంక్షన్ మధ్య, చిల్కూరు రిజర్వ్​ ఫారెస్ట్​ బ్లాక్​ శంషాబాద్ డివిజన్ లోని మంచిరేవులలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫారెస్ట్​ పార్కు విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మంచిరేవుల ఫారెస్ట్​పార్కులో నేచురల్​గా ఉన్న బండరాళ్లపై అందమైన పెయింటింగ్స్ వేశారు. 

ఇవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కొండలతో కూడిన ఈ ప్రాంతం, మెలికలు తిరిగి ఉన్న జలప్రవాహాలు, నీటి వనరులు, సహజంగా ఏర్పడ్డ రాళ్లతో అందంగా ఉంది.ఇంతకుముందు, ఈ ప్రదేశాన్ని నిర్మాణాలు, భవన వ్యర్థాలకు డంపింగ్ గ్రౌండ్‌గా వినియోగించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ కాన్సెప్ట్ కింద ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కి అనువుగా తీర్చిదిద్దారు.  రూ.7 కోట్ల 38 లక్షలతో దీనిని పర్యాటకంగా అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్​తో పాటు మొక్కల పెంపకం, కంపౌండ్​వాల్​ నిర్మాణం తదితర అభివృద్ధి పనుల్ని చేపట్టారు.  

  • గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చారు
  • HMDA, అటవీ శాఖ కలిపి దాదాపు 4.5 కి.మీ కంపౌండ్ వాల్​ని నిర్మించింది.  
  • ఖాళీ ప్రదేశాల్లో సుమారు 50 వేల స్థానిక జాతుల మొక్కలు నాటారు.
  • పర్యాటకుల ద్వారా నెలకు రూ. 3 లక్షల ఆదాయం రాబట్టాలని టార్గెట్​గా పెట్టుకున్నారు
  •  రాళ్లపై జంతువుల పెయింటింగ్‌తో పాటు ప్రత్యేకంగా బ్యాలెన్సింగ్ రాక్స్, బేబీ ఎలిఫెంట్, డేగ ముఖం తదితర చిత్రాలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి.
  • పార్కులో అభివృద్ధి చేసిన చిన్నచెరువు, పెద్దమ్మచెరువు, చెక్ డ్యాం ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా మార్చాయి.
  • ఇది బొటానికల్ గార్డెన్, KBR నేషనల్ పార్క్ అంతటి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని అధికారులు చెబుతున్నారు.