
నిరుద్యోగ యువతకు ఇదొక మంచి అవకాశం. హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా జరగబోతుంది. మే 17వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఆసక్తిగల నిరుద్యోగులెవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ జాబ్ మేళాలోచాలా కంపెనీలు పాల్గొననున్నాయి. ఫార్మా, ఆరోగ్యం, ఐటీ & ఐటీఈఎస్ సంస్థలు, విద్య, బ్యాంకులు ఇతర రంగాలలో పలు హోదాల్లో ఉద్యోగాలను ఆఫర్ చేయనున్నాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కూడా అందిస్తాయి.
అభ్యర్థుల అర్హత SSC కంటే ఎక్కువగా ఉండాలి, ప్రాథమిక ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళాకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఆసక్తిగల నిరుద్యోగులు మరిన్ని వివరాల కోసం 8374315052 నంబర్ను సంప్రదించవచ్చు.