హైదరాబాద్ మెట్రోలో స్టూడెంట్ పాస్.. కుర్రోళ్ల జాయ్ జాయ్ రైడ్

హైదరాబాద్ మెట్రోలో స్టూడెంట్ పాస్.. కుర్రోళ్ల జాయ్ జాయ్ రైడ్

విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల కోసం.. కొత్తగా స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ కార్డ్ రూపంలో ఇది అందుబాటులో ఉండనుంది. 

ఈ పాస్ కోసం.. విద్యార్థులు కేవలం 20 ట్రిప్పుల మొత్తాన్ని చెల్లించాలి. అనంతరం 30 రోజుల్లో 30 రైడ్‌లు  చుట్టేయచ్చు. ఈ పాస్ వ్యాలిడిటీ 9 నెలలు. అంటే.. జూలై 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ తన అధికారిక హ్యాండిల్ ద్వారా  వెల్లడించింది.

JNTU, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్‌నగర్ స్టేషన్‌లలో ఈ పాస్‌ కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు వారి వారి కళాశాల ఐడి కార్డ్‌ చూపించి.. స్టూడెంట్ పాస్ మెట్రో కార్డ్‌ను పొందవచ్చు.